కానీ రాష్ట్రంలో అకాల వరదలు, భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి తదితర జిల్లాలు సతమతమవుతున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అలాగే రాష్ట్ర పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం వంటి జాతీయ సంస్థలు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులందరూ వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో ఉన్నారు.