BRS Mlas Car Attack : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన ఉద్రిక్తంగా మారింది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కారుపై దాడి జరిగింది. మాజీ మంత్రులు హ‌రీష్ రావు, జ‌గ‌దీష్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్, స‌బితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు కారుపై రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలే దాడులు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మంచికంటి న‌గ‌ర్‌లో బీఆర్ఎస్ నేత‌లు ప‌ర్యటిస్తుండ‌గా రాళ్ల దాడి జరిగింది. వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ కార్యక‌ర్తలు అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ కార్యక‌ర్తకు తీవ్ర గాయాల‌య్యాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. అతడిని ఆస్పత్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here