గోదావరి ఉధృతి..
భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ముంపు గ్రామాల్లోని గర్భిణులు, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.