(7 / 7)
వరద బాధితులను ఆదుకునేందుకు సినీరంగ ప్రముఖులు ముందుకు వచ్చారు. హీరోలు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ , సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నిర్మాతలు, దర్శకులు విరాళాలు ప్రకటిస్తున్నారు. హీరో బాలకృష్ణ ఇరు రాష్ట్రాలకు చెరొక 50 లక్షల విరాళం ప్రకటించారు. జూ.ఎన్టీఆర్ రూ.కోటి, సిద్ధు జొన్నలగడ్డ రూ.30 లక్షలు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.కోటి, నిర్మాత ఎస్.రాధాకృష్ణ రూ. 50 లక్షలు, ఎస్.నాగ వంశీ రూ. 25 లక్షల చొప్పున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు.