ఈ మేరకు వరంగల్ సీసీఎఫ్ ప్రభాకర్, ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కిషన్ జాదవ్, ఇతర అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం సాయంత్రం ఒక దఫా ఎంక్వైరీ చేసి, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. చెట్లు నేలకూలిన ప్రదేశాన్నంతా కలియ తిరిగారు. ఒక్క గాలివానకే ఇంత పెద్ద నష్టం జరగడం ఇదే తొలిసారి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళవారం అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టగా.. బుధవారం టెక్నికల్ టీమ్ అధికారులు కూడా అటవీ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక తయారు చేయనున్నట్లు తెలిసింది.