అప్రమత్తంగా ఉండాలి – ఎస్పీ రోహిత్ రాజు

సెల్ఫీల కోసం వాగులు, వంకలు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. వరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దన్నారు. వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయని, వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. కావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలని సూచించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here