భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఓవైపు అధికారులు, మరో వైపు లోతట్టు ప్రాంతాల ప్రజల గుండెల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 36.7 అడుగులకు చేరుకుంది. కాగా నేటి ఉదయానికి అంటే బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 42.10 అడుగులకు ఎగబాకింది.