ఘటనా స్థలంలో రోడ్డుకు అడ్డంగా పడిన లారీలను పోలీసులు పక్కకు జరిపి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని ట్రాఫిక్ ఏడీసీపీ కే. ప్రవీణ్ కుమార్, ఏసీపీలు వాసుదేవరావు, పెంటారావు, సీఐలు కాంతారావు, టీవీ తిరుపతిరావు తదితరులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేపల లోడ్ లారీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్కు పోలీసులు తరలించారు.