తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ కష్ట కాలంలో తెలుగు ప్రజలకు అండగా నిలబడటానికి తెలుగు సినీ పరిశ్రమ కదిలింది. ఇప్పటికే ఎందరో సినీ స్టార్స్ లక్షలు, కోట్లలో తమకు తోచిన సాయాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాదు సినీ పరిశ్రమ అంతా ఒక తాటిపైకి వచ్చి  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు “వరద బాధితుల కొరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు సినీ పరిశ్రమ చేయూత” పేరుతో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, దర్శకుడు రాఘవేంద్రరావు సహా పలువురు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here