వైసీపీ స్పందన..
అటు మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై వైసీపీ స్పందించింది. ‘వరద విపత్తులోనూ కూటమి ప్రభుత్వం బురద రాజకీయం చేస్తోంది. మాజీ ఎంపీ, దళిత నాయకుడు నందిగం సురేష్ని అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. విజయవాడలో వరద బాధితుల హాహాకారాలు పట్టించుకోకుండా.. కక్ష సాధింపు రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. వరద విలయతాండవం చేసిన సింగ్ నగర్లో బాధితులకి నిన్నటి వరకు సాయం చేసిన.. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాస రెడ్డిని కూడా అరెస్ట్ అయ్యారు. ఈ క్లిష్ట సమయంలో వరద బాధితులకి సాయంగా ఉండాల్సిన పోలీసుల్ని.. ఇలా స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటారా’ అని వైసీపీ ప్రశ్నించింది.