5 రోజులుగా కరెంట్ బంద్..
విజయవాడలోని వాంబే కాలనీ, సింగ్ నగర్లో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అటు విజయవాడలోని చాలా ప్రాంతాల్లో 5 రోజులుగా కరెంట్ లేదు. దీంతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు నగరంలోని కాలువల్లో వాహనాలు బయటపడుతున్నాయి. తమతమ వాహనాల కోసం యజమానులు వెతుకుతున్నారు. కార్లు, బైకులు, ఆటోలు వరదల్లో కొట్టుకుపోయాయి. వాటి కోసం వెతుకులాట ప్రారంభం అయ్యింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.