యాదాద్రి భువనగిరి జిల్లా:మోటకొండూర్ మండల( Motakondu) కేంద్రంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ మండల కోశాధికారి బాల్ద నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఆయన
మాట్లాడుతూ విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపి, విద్యాబుద్ధులు నేర్పి రేపటి పౌరులుగా మార్చే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం చాలా అదృష్టమన్నారు.

 Tribute To Teachers Under The Auspices Of Siddhartha Foundation-TeluguStop.com

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తండా కృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు పీసరి తిరుమలరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆలేటి నాగరాజు,మండల ఉపాధ్యక్షుడు మల్గా అశోక్,యువమోర్చా మండల అధ్యక్షుడు భూమండ్ల సతీష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ శనిగారం ప్రదీప్, రేగు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here