రేవంత్ భరోసా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. పంట నష్టంపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. మృతులు, బాధితుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు నేతృత్వంలో ఖమ్మం జిల్లాలో పర్యటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.