ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నాయకులు దేవినేని అవినాశ్, నందిగం సురేష్, ఆ పార్టీ కార్యకర్తలు జి.రమేష్, షేక్ రబ్బానీ భాషా, చిన్నాబత్తిన వినోద్ కుమార్ సహా మరికొందరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు బుధవారం నిరాకరించింది. ఈ క్రమంలోనే మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. కేసుల్లో ఉన్న నేతలను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.