యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల్లో ముందు వరుసలో నిలబడే నిఖార్సయిన ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి.ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.

 Jitta Balakrishna Reddy, The Telangana Malidasha Movement That Fell To The Groun-TeluguStop.com

ఆయన మృతి చెందారన్న విషాదవార్త తెలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు,సహచర ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.జిట్టా భౌతకకాయాన్ని స్వగ్రామానికి చేర్చారు.

ఆయన అంత్యక్రియలు భువనగిరి పట్టణ శివారులోని మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్ లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here