14 ఏళ్ల పిల్లలు..
నైరీ కౌంటీలోని హిల్ సైడ్ ఎండరాషా ప్రైమరీలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో తెలిపారు. ఈ పాఠశాల 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు విద్య, వసతి సేవలు అందిస్తుంది. అగ్నిప్రమాదం జరిగిన వసతి గృహంలో 150 మందికి పైగా బాలురు ఉన్నారని నైరీ కౌంటీ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా భవనాలు చెక్కతో నిర్మించినందున, మంటలు చాలా వేగంగా వ్యాపించాయి.