ఖమ్మం నగరంపై ప్రభావం..
ఖమ్మం నగరంపై వరదల ప్రభావం ఎక్కువగా పడింది. అన్ని రంగాలు నష్టపోయాయి. రైతులు, చిరు వ్యాపారులు, మెకానిక్లు, కిరాణా వర్తకులు భారీ నష్టపోయారు. మున్నేరు వరదల కారణంగా షాపుల్లోకి నీరు వచ్చి వస్తువులు పాడయ్యాయి. అటు మెకానిక్ షాపుల వద్ద రిపేర్ కోసం తెచ్చిన వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. లారీలు, కార్లు, ఆటోలు, బైక్లు వరదల్లో కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాల ఇంజిన్లలోకి నీరు చేరింది. ఇటు పంట నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.