మహేష్ కుమార్ గౌడ్ 26 జూన్ 2021వ తేదీ నుంచి TPCC వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సీటును ఆశించినప్పటికీ దక్కలేదు. ఈ స్థానం నుంచి షబ్బీర్ అలీ పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావటంతో జనవరి, 2024లో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ పదవి దక్కింది. జనవరి, 31 2024వ తేదీన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి… ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.