నిమజ్జన సమయంలో జాగ్రత్తలు

వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఆంక్షలు విధించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. వినాయకుని నిమజ్జనానికి కూడా వెళ్లి ప్రమాదం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2 వేల మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం అందిస్తున్నామన్న ఏలూరు జిల్లా కలెక్టర్ సీఎంకు వివరించారు. విజయనగరం జిల్లాలో నిన్న, ఇవాళ భారీ వర్షాలున్నాయని, దానికి అనుగుణంగా రాకపోకలను బ్రిడ్జిలపై నియంత్రిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here