రష్యా- ఉక్రెయిన్​ యుద్ధానికి ముగింపు పలికి, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్​ సెక్యూరిటీ అడ్వైజర్​ (ఎన్​ఎస్​ఏ) అజిత్​ దోవల్​ మాస్కోకు వెళ్లనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ రెండు నెలల వ్యవధిలో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్​లో పర్యటించి, ఆయా దేశాధినేతలను కలిసిన అనంతరం ఈ వార్త వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here