ఖండించిన వైసీపీ..
నంబూరి శంకర్ రావు వాహనంపై దాడి ఘటనను వైసీపీ ఖండించింది. ‘పల్నాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై దాడికి తెలుగుదేశం పార్టీ గూండాలు కుట్ర చేశారు. భారీ వర్షాలతో పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వెళ్లారు. శంకర్రావు కోసం వేచి ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేశారు. నాయకుల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పల్నాడులో ఇంకెన్నాళ్లు ఈ దౌర్జన్యం, దాడులు చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.