నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో భారీ వర్షాలతో దెబ్బతిన్న సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, పురాతన భవవనాలకు జరిగిన నష్టంపై ప్రత్యేక అధికారికి వివరించారు. విద్యుత్ శాఖలో 83 పోల్స్కు నష్టం జరిగితే.. ఇప్పటివరకు 63 పోల్స్ను సరిచేసినట్టు అధికారులు వివరించారు. అంతకుముందు భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు, నివాస గృహాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్ పరిశీలించారు.