ముంబయి, పూణే, లాతూరు వంటి పెద్ద సిటీలలో
గంజాయి వ్యాపారి అయినా కర్ణాటక రాష్ట్రం బాల్కి గ్రామానికి చెందిన మల్లుగొండ, ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి నుంచి ఎండు గంజాయిని రాహుల్ సహాయంతో తీసుకుంటాడని తెలిపారు. మల్లుగొండ ఆ గంజాయిని ముంబయి తరలించేందుకు బాల్కికి చెందిన లఖన్, సిద్దిరామ్, సునిల్, కిరణ్, మల్లేశ్ నాయక్ ల సహాయం తీసుకొని ఎవరికి తెలియకుండా కార్లలో, బోలెరో వాహనాలలో తరలిస్తారు. మల్లుగొండకు గంజాయిని ముంబయి, పూణే, లాతూరు వంటి పెద్ద సిటీలలో ఎక్కువ ధరకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడని ఎస్పీ తెలిపారు. మిగతా వ్యక్తులు మల్లుగొండ, రాహుల్, కిరణ్, సునీల్, మల్లేశ నాయక్ లు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వివరించారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు ప్రకటించారు.