స్థానిక ఎటపాక వాగు పొంగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం ఆర్డీవో, పోలీసు సిబ్బంది, పూర్తి స్థాయి పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. మరో వైపు రెడ్డిపాలెం – సారపాక మధ్యలో ప్రధాన రహదారి పైకి గోదావరి వరద నీరు చేరుతోంది.