సంగారెడ్డి పట్టణంలోని ముంపు ప్రాంతాలైన రెవెన్యూ కాలనీ , శ్రీ చక్ర కాలనీ లను మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సందర్శించారు. వరద నీరు కాలనీలోకి రాకుండా చర్యలు చేసి తీసుకోవాలని నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశించారు. పట్టణానికి అనుకొని ఉన్న ఎర్రకుంట, చంద్రయ్య కుంటలలో వరద కాలువలు పూడుకపోవడం , అధిక వర్షాలు పడడం, ఎర్రకుంట తూము చిన్నగా ఉండడం కారణంగా వరద నీరు బయటకు వెళ్లలేక, రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీల లోకి వచ్చింది.