ఆశా ఒక స్నేహితురాలి నుంచి బీవైఎస్​టీ (భారతీయ యువశక్తి ట్రస్ట్​) గురించి తెలుసుకున్నప్పుడు, ఆమె తన కలను సాకారం చేసుకునేందుకు ఇదే మంచి అవకాశంగా భావించారు. ఆమె సహాయం కోసం బీవైఎస్​టీని సంప్రదించింది, మరింత విశ్వాసం పొందడానికి ఆన్‌లైన్ సెషన్‌లకు హాజరయ్యారు. ఆమె వ్యాపార ప్రతిపాదనను రూపొందించారు. ఆన్‌లైన్ శిక్షణల ద్వారా, ఆమెకు ఇంతకు ముందు తెలియని వివిధ ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలుసుకున్నారు. వివిధ ప్లాట్‌ఫామ్స్​ ద్వారా మరికొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత, ఆమె వ్యాపార రుణం మొత్తం 20 లక్షలను ఎస్​బీఐ ద్వారా పొందింది. అయితే, రుణాన్ని పంపిణీ చేయడానికి ముందు, బ్యాంక్ అధికారికి వ్యాపార ప్రాజెక్ట్ గురించి పెద్దగా అంచనాలు లేవు. తన ఉత్పత్తిపై ఆమెకున్న విశ్వాసం చెక్కుచెదరకుండా ఉంది. ఆమె అతనిని 15 రోజుల పాటు వంటసామాను ఉపయోగించడానికి అనుమతించారు. అతను సంతృప్తి చెందాడు. ఉత్పత్తిలో అవకాశాలను చూసి రుణాన్ని మంజూరు చేశారు. ఉత్పత్తి కొత్తది అయినందున వారు ఆమె ఫైల్‌ని బీవైఎస్​టీ ద్వారా తరలించారు. ఆమెకు స్థిరమైన మార్గదర్శకత్వం, పర్యవేక్షణ కూడా అవసరమని వారు భావించారు. రుణం పంపిణీ చేసిన తర్వాత, ఈ ప్రక్రియ ద్వారా ఆమెకు మార్గనిర్దేశం చేసేందుకు బీవైఎస్​టీలో మెంటార్‌గా స్వచ్ఛంద సేవను అందజేస్తున్న రిటైర్డ్ బ్యాంకర్ శ్రీ ధన్​రాజ్​ తిరుముల ఆమెకు మెంటార్‌గా నియమించారు. వ్యాపారంలో అడుగడుగునా ఆమెకు మార్గదర్శకంగా నిలిచాడు. ఆమె తన ఆస్తులను నిర్వహించడం, తన ఉద్యోగులతో ఎలా వ్యవహరించాలి, ఎస్​ఓపీలను ఎలా సిద్ధం చేయాలి, అలాగే సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను ఎలా రూపొందించాలో నేర్చుకున్నారు. ఆమె అతిపెద్ద ఆర్డర్ విలువ రూ. 65 లక్షలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here