తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు వారాలు ఎడతెరిపి లేని వర్షాలతో తెలంగాణలో పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాలో గత వారం కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. అటు వరంగల్, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలను సైతం భారీ వర్షాలు తీవ్రంగా నష్టం కలిగించాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోడానికి ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here