ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను జూన్‌ 12వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ ఫలితాల్లో పేపర్‌-1లో 57,725 మంది, పేపర్‌-2లో 51,443 మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవలె డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫైనల్ కీ వెలువడిన విషయం తెలిసిందే. తుది ఫలితాలు ప్రకటించేందుకు టెట్ మార్కుల ఎడిట్ చివరి అవకాశం కల్పించింది విద్యాశాఖ. రెండు, మూడు రోజుల్లో డీఎస్సీ తుది ఫలితాలు విడుదల కానున్నాయి. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులను కలిపి డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో టెట్ వివరాల ఎడిట్ కు పాఠశాఖ విద్యాశాఖ అవకాశం కల్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here