హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో పోలీసులు కీలక ఆదేశాలను జారీ చేశారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో అన్ని రకాల వైన్స్, కల్లు, బార్ షాపులను మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.