రాహుల్ గాంధీ సంతాపం

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) సీతారాం ఏచూరిని ‘‘మన దేశంపై లోతైన అవగాహన ఉన్న భారతదేశం అనే భావనను పరిరక్షించే వ్యక్తి’’ అని అభివర్ణించారు. ‘‘మేం జరిపిన సుదీర్ఘ చర్చలను మిస్ అవుతున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏచూరి మంచి మనిషి అని, అలుపెరగని మార్క్సిస్టు అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కొనియాడారు. ‘‘మా అనుబంధం మూడు దశాబ్దాలకు పైగా కొనసాగింది మరియు మేము వివిధ సందర్భాల్లో సన్నిహితంగా కలిసి పనిచేశాము. ఆయనకు రాజకీయ రంగాలకు అతీతంగా స్నేహితులు ఉన్నారు’’ అని జైరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here