పూర్వ విద్యార్థులే బలం..

1991 నుంచి ఇప్పటి వరకు 33 సంవత్సరాల పాటు లక్షన్నరకు పైగా విద్యార్థులు అల్పోర్స్ విద్యాసంస్థల్లో చదువుకున్నారు. వారు ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. 90 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఉండటం సహజమైనందున పూర్వ విద్యార్థులందరూ కూడా తనకు మద్దతునిస్తారనే విశ్వాసాన్ని నరేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఉన్న టీచర్లు, సిబ్బంది అండగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల వారీగా ఉపాధ్యాయులు, తన సన్నిహితులతో సమావేశాలు జరుపుతున్నారు. నరేందర్ రెడ్డి తన అభ్యర్థిత్వం పట్ల సానుకూలత వ్యక్తమైన తర్వాతనే పోటీకి సిద్ధపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం దక్కితే.. ఆ పార్టీ పరంగా ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల సహకారంతో మరింత మద్దతు లభించే అవకాశం ఉంది. కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రెడ్డి సామాజికవర్గానికి మొదటి నుంచి తనవంతుగా సహాయసహకారాలు అందిస్తుండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here