రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్ ప్రేమలత ఆదేశాల మేరకు గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్ రాజన్న సిరిసిల్ల కోర్ట్ ఆవరణలో ని లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
వారికి ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టి.పరశురాములు చీఫ్ లీగలేడు డిఫెన్స్ కౌన్సిల్, ఎస్ మల్లేష్ యాదవ్ డిప్యూటీ చీఫ్ ఎల్ ఏ డి సి ఎస్ ,ఈ.జ్యోతి అసిస్టెంట్, ఎల్ ఏ డి సి ఎస్, సిబ్బంది పాల్గొన్నారు.