రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని వెంగల్ చెరువు మత్తడి రోడ్డు ప్రయాణికులకు , శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.గతవారం క్రితం కురిసిన భారీ అకాల వర్షాలకు మత్తడి పొంగడంతో మత్తడి దారి తీవ్ర ఇబ్బందిగా మారింది దీనిపై గ్రామస్తులు ప్రయాణికులు భక్తులు మాట్లాడుతూ మల్యాల నుండి చందుర్తి వెళ్ళుదామంటే తీవ్ర ఇబ్బందికి గురి అయింది రోడ్డు గ్రామ స్పెషల్ అధికారి చర్య తీసుకొని రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని గ్రామస్తులు ప్రయాణికులు కోరుతున్నారు.
మరో మూడు రోజుల్లో వినాయక నిమర్జనం ఉండడంతో ఈ చెరువులనే నిమర్జనం చేస్తారు కాబట్టి ఆలోపు ఈ రోడ్డును మరమత్తులు చేయాలని గ్రామస్తులు ప్రయాణికులు కోరుతున్నారు టు వీలర్ బైక్ వెళ్లడానికే ఈ రోడ్డు వెళ్లరాకుండా ఉన్నది దీనిపై అధికారులు చర్య తీసుకుని రోడ్డు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు .