రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.అరెస్టు చేసిన వారిలో బి అర్ ఏస్ నాయకులు గుంటి శంకర్ , చింధం రమేష్ తో పాటు పలువురిని అరెస్టు చేశారు.
బి అర్ ఏస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య ను కరీంనగర్ లోని ఆయన నివాసం లో పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.నిన్న కౌశిక్ రెడ్డి ఇంటిపై అరెకపూడి తన అనుచరులతో కలిపి దాడి చేశారు.
దీన్ని నిరసిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపుమేరకు ఉదయం బి ఆర్ ఎస్ నాయకులు హైదారాబాద్ వెళ్తారనే సమాచారం తో పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు.అధికార బలంతో బి ఆర్ ఎస్ నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి తగదన్నారు.
అక్రమ అరెస్టు లతో ఉద్యమాన్ని ఆపలేరని బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు.మాజీ మంత్రి హరీశ్ రావు సీపీ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునివ్వగా హైదరాబాద్ కు వెళ్తారని ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదని అన్నారు.