వలస పాలన నాటి పేర్ల స్థానంలో

వలస పాలన నాటి పేర్లను, నాటి గుర్తులను మార్చాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) దార్శనిక నిర్ణయంలో భాగంగా పోర్ట్ బ్లెయిర్ పేరును ‘‘శ్రీ విజయపురం’’గా మార్చాలని నిర్ణయించామని అమిత్ షా వెల్లడించారు. మునుపటి పేరు వలసవాద గుర్తును కలిగి ఉందన్నారు. ‘‘శ్రీ విజయ పురం అనే పేరు మనం స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి, ఆ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్, నికోబార్ ద్వీపాల ప్రత్యేక పాత్రకు ప్రతీక’’ అని అమిత్ షా (amith shah) తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here