రైతు బంధు పేరును అయితే మార్చి రైతుభరోసాగా పేర్కొన్నది కానీ, ఇంకా సరైన విధివిధానాలు రూపొందించలేదు. ఎన్ని ఎకరాల వరకు సాయం అందించాలి..? ఎందరికి అందించాలి..? వంటి వివరాలు సేకరిస్తోంది. గతంలో రైతు బంధు కింద సాగుయోగ్యం కానీ భూములకు, సాగులోలేని భూములకు, కొండలు, గుట్టలతో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్లాట్లుగా మారిన వ్యవసాయ భూములు, ఫామ్ హౌజ్ లకు కూడా ధనవంతులైన వారికి రైతు బంధు అందిందన్న విమర్శలతో రైతు భరోసా ను కేవలం అర్హులకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, రుణ మాఫీ కార్యక్రమంతో రైతు భరోసా అటకెక్కినట్లు కనిపిస్తోందన్న అభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here