రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం లక్ష్మీ గణపతి స్వామి వారిని వివిధ రకాల పండ్లతో అలంకరించారు.
నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద హవనం, హోమం కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నమిలకొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈఓ కె.వినోద్ రెడ్డి పాల్గొన్నారు.సాయంత్రం మహా పూజ జరుగుతుంది.