హైడ్రా తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. హైడ్రా అధికారాలపై లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.