తెలంగాణలోని పాత జోన్లు (5, 6) ప్రకారమే బదిలీలు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రిన్సిపల్స్ను రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని బదిలీ చేయనున్నారు. పీజీటీ, టీజీటీలకు జోన్ యూనిట్గా బదిలీలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము బదిలీల కోసం ఎదురుచూశామని.. తమ డిమాండ్ను నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి మోడల్ స్కూల్ టీచర్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.