ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు లడ్డు సొంతం చేసుకున్నారు. వేలం పాటలో లడ్డును సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని గణేష్ అన్నారు. ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నానని కొండపల్లి గణేష్ అన్నారు. ఏటా లడ్డు వేలం పాటలో పాల్గొంటామని, ఈసారి లడ్డు కైవసం చేసుకునే అవకాశం లభించిందన్నారు. గతేడాది ఇక్కడి లడ్డు రూ.25.50 లక్షల ధర పలికింది. ఇప్పటి వరకూ తెలంగాణలో ఇదే అత్యధిక లడ్డు వేలం ధర కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here