యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో నిలువ నీడలేని నిరుపేద కుటుంబానికి చెందిన దుంప ఎల్లయ్య ఇటీవల మృతి చెందాడు.ఆ కుటుంబ పరిస్థితిని చూసి స్థానికులు వాట్సాప్ లో పెట్టిన సందేశానికి స్పందించిన 108 మంది దాతలు రూ.60వేలు విరాళంగా అందించారు.ఆ నగదును బాధిత కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు అందజేశారు.

 Donors Who Responded To The Whatsapp Message , Whatsapp Message, Donors-TeluguStop.com

ఈ సందర్భంగా దాతలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, పిన్నింటి మోహన్ రెడ్డి, పోతగాని మల్లేశం పైళ్ల దామోదర్ రెడ్డి,నల్ల చంద్రస్వామి,బొంత అంజయ్య,దొంతరపోయిన భాస్కర్,పాశం వెంకట్ రెడ్డి,యాస వెంకట్ రెడ్డి, తిరుమల్ రెడ్డి,కోరే కనకయ్య,మాద రాంబాబు,రాచమల్ల కృష్ణ, యాస గోవర్ధన్ రెడ్డి,కోల ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here