వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిసిన చిరంజీవి.. కోటి రూపాయల విలువైన ఈ రెండు చెక్కులను అందజేశారు. 

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ (Sai Durgha Tej) కూడా వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి తాను ప్రకటించిన 10 లక్షల రూపాయల విరాళాన్ని.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ రూపంలో అందించారు.

వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తాజాగా పలువురు ప్రముఖుల విరాళాలు అందించారు. అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రూ.కోటి విరాళం అందజేశారు. యువ హీరో విశ్వక్ సేన్ రూ.10లక్షలు విరాళంగా అందించగా, సీనియర్ నటుడు అలీ రూ.3లక్షలు విరాళంగా అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here