విద్య, ఆర్థికం, రెవెన్యూ, న్యాయ శాఖలతో పాటు పలు కీలక శాఖలను నిర్వహించడం ద్వారా అతిషి ముఖ్యమంత్రి పీఠం రేసులో ముందు వరుసలో ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిసోడియా, కేజ్రీవాల్​లు జైలులో ఉన్నప్పుడు.. ఆప్​ తరఫున ఆమె తీవ్రస్థాయిలో పోరాటం చేసి వార్తల్లో నిలిచారు. కేజ్రీవాల్​ సైతం.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన స్థానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆమెనే నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన స్థానంలో గహ్లోత్​ను నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here