కొన్ని రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పాడి వర్సెస్ అరెకపూడి వ్యవహారం పోలీస్ కేసుల వరకూ వెళ్లింది. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అతని అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.