అర్హులందరికీ రేషన్, హెల్త్ కార్డులు
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. వైట్ రేషన్ కార్డులకు ఎవరు అర్హులనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి నిబంధనలు ఎలా ఉండాలని రాజకీయ పార్టీలకు లేఖ రాశామన్నారు. కొన్ని పార్టీలు సూచనలు చేశాయన్నారు. ఇలా వచ్చిన సూచనలపై సమావేశంలో చర్చించామన్నారు. తెలంగాణలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.