12వ తేదీన రెండు వందేభారత్ రైళ్లలో 255 మంది వెయింటింగ్ లిస్టు ఉంది. ఈస్ట్కోస్ట్లో అన్ని తరగతుల్లో 221 మంది వెయిటింగ్లిస్టు జాబితాలో ఉన్నారు. పద్మావతి, చెన్నై, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లలో 10-12 తేదీల్లో పెద్ద ఎత్తున వెయిటింగ్ లిస్టు ఉంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లేవారికీ విశాఖ గరీబ్రథ్, కోకనాడ, ఈస్ట్కోస్ట్, గోదావరి, చార్మినార్, సింహపురి ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో రిజర్వేషన్ దొరకట్లేదు. కేవలం శాతవాహన, గుంటూరు ఇంటర్సిటీ, కృష్ణా ఎక్స్ప్రెస్, గోల్కొండలలో మాత్రం 10, 11, 12 తేదీల్లో తక్కువ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నాయి.