నాగ్పూర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 4.15 గంటలకు వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. నాగ్పూర్లో బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్కు రాత్రి 10.45 గంటలకు చేరుకోనుంది. ఈ రైలుకు స్వాగతం పలికేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. సికింద్రాబాద్-నాగ్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ 19వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.