తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించి అనేక మంది నిరాశ్రయులుగా మిగలడంతో పాటుగా  ఎంతో పంట నష్టం కూడా జరిగింది. అదే విధంగా కొంత మంది మృత్యువాత కూడా పడ్డారు. దీంతో అనేక మంది సినీ సెలెబ్రటీస్ తమ వంతు సాయంగా విరాళాన్ని ప్రకటించారు. 

ప్రముఖ కామెడీ నటుడు,  హీరో అలీ(ali)కొన్ని రోజుల క్రితం  రెండు తెలుగు రాష్ట్రాలకి ఆరు లక్షలు ప్రకటించాడు. తెలంగాణ కి మూడు లక్షలు, ఆంధ్రప్రదేశ్ కి మూడు లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షలని ప్రకటించాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ని కలిసి మూడులక్షల చెక్కుని అందించాడు. అలీ వెంట ఆయన సతీమణి కూడా ఉంది. ఈ సందర్భంగా అలీ ని రేవంత్ రెడ్డి అభినందించడమే కాకుండా శాలువతో సత్కరించారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ని కలిసి ఎప్పుడు అమౌంట్ ని ఇస్తాడో చూడాలి. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ని కూడా కలుస్తాడా అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here