సుప్రీంకోర్టు ఆదేశాలు

తమ అనుమతి లేకుండా అక్టోబర్ 1వ తేదీ వరకు బుల్డోజర్ కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ రోడ్లు, జలవనరుల ప్రాజెక్టులు, రైల్వే లైన్ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతలను ఇందులో నుంచి మినహాయించింది. మునిసిపల్ చట్టాల ప్రకారం ఆస్తులను ఎప్పుడు, ఎలా కూల్చివేయవచ్చనే దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. గతవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘బుల్డోజర్ జస్టిస్’ను విమర్శించింది. చట్టాన్ని అత్యున్నతమైనదిగా భావించే దేశంలో ఈ బుల్డోజర్ బెదిరింపులు సరికాదని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here