పశ్చిమ బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌, రెసిస్టెన్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం దిల్లీలో సమావేశం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజేష్ పాండే మాట్లాడుతూ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో న్యాయమైన విచారణ జరగాలన్నదే తమ మొదటి డిమాండ్ అని అన్నారు. దేశంలోని మిగిలిన వైద్యులందరూ తమ నిరసనల్లో జూనియర్ డాక్టర్లతో ఉన్నారని చెప్పారు. నిరసనలో పాల్గొన్నందుకు పోలీసులు పిలిచి ప్రశ్నిస్తున్న విధానాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here